జనసేన పార్టీ కార్యాలయంలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవవేడుకలు

రాజమండ్రి: 73వ భారత రాజ్యాంగ దినోత్సవవేడుకలు స్థానిక రాజమహేంద్రవరం దానవాయి పేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ తరుపున దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చే రూపొందించబడి, 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించినవారిలో తూ.గో.జిల్లా సంయుక్త కార్యదర్శి
గెడ్డం నాగరాజు, రాజమండ్రి కర్పొరేషన్ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, నగర సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు, జన సైనికులు బాసరమణి దుర్గప్రసాద్, కుంది రాము, నంగినశ్రీను, తూట్ట హేమ దుర్గ లు నివాళులర్పించారు.