జనసైనికుడు దుర్గారావును పరామర్శించిన మేడ గురుదత్

రాజానగరం: రాజానగరం మండలం, పాతవెలుగుబంధ గ్రామానికి చెందిన జనసేన క్రియశీలక సభ్యుడు కర్రీ దుర్గారావు ఇటీవల బండి యాక్సిడెంట్ లో తీవ్ర గాయలు పాలై కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దుర్గారావుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినా అక్కడ వైద్యం సరిగ్గా అందట్లేదు అనే విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించి డాక్టర్లతో మాట్లాడి అక్కడ వైద్యం జరిగేలా చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల కమిటీ సభ్యులు మెడిద వీరబాబు, అడబాల హరి కృష్ణ, పాత వెలుగుబంధ జనసేన పార్టీ నాయకులు పేదిశెట్టి రమేష్, ముసమర్ల వంశీ కృష్ణ, సానపు శివ, మన్నే మణి తదితరులు పాల్గొన్నారు.