అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన సింగరాయకొండ జనసేన

కొండెపి: భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం సింగరాయకొండ మండలంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన జనసేన మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, మరియు జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, షేక్ మా భాషా, శీలం సాయి, పసుమర్తి నాగేశ్వరావు, సాగి వెంకట అభయ్, గుట్టుకొండ నాగరాజు మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.