అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ భారత రాజ్యాంగ నిర్మాత, ఉన్నత విద్యావంతుడు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు, భారతరత్న శ్రీ బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముమ్మిడివరం జనసేన కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, గొలకోటి వెంకన్న బాబు, కడలి కొండ, గాలిదేవర బుల్లి, విత్తనాల అర్జున్, గొలకోటి సాయి, నాతి నాగేశ్వరరావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.