విద్యార్థి అమర్నాథ్ హత్యకు కారకులని కఠినంగా శిక్షించాలి

  • విద్యార్థి అమర్నాధ్ కు కొవ్వొత్తులతో జనసేన నివాళులు
  • అమర్నాధ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉండి పోరాడుతుంది

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఆఫీసులో బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన చెరుకుపల్లి మండలం, రాజోలు ఉప్పల వారి పాలెంలో బీసీ గౌడ ఆడబిడ్డతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అడ్డుకున్నందుకు ఆమె సోదరుని అగ్రవర్ణాల కుల రెడ్డి కులస్తుల వారు పదవ తరగతి చదువుతున్న ఉప్పల అమర్నాథ్ అనే విద్యార్థిని భయంకరంగా హింసించి, కర్రలతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యని ఖండిస్తూ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ.. ఉప్పల అమర్నాథ్ పై పెట్రోలు పోసి నిప్పంటిచ్చి హత్య చేసిన దోషులను ఎంతటి వారైనప్పటికీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పైబోయినపోయిన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్రప్రసాద్, కేశవట్ల విజయ్, బయనపాలేపు ముఖేష్, అత్తిలి బాబి, సోమరాజు, చిట్టి, బాలాజీ, సోము, పెద్దోడు, వల్లి, సతీష్ జనసేన వీర మహిళలు వెజ్జూ రత్నకుమారి, చాంద్ బేబి, సోమలమ్మ మరియు జనసైనికులు పాల్గొన్నారు.