సహాయంచేసే దిశగా ఇంకో మెట్టు ఎక్కిన … సోనూ సూద్
కరోనా సమయంలో కష్టంలో ఉన్నవాళ్లని ఆదుకునే దిశగా సోనూ సూద్ ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకునే వారిని దేవుడు అంటారు. వలస కార్మికులు ఈ కరోనా కాలంలో సోనూ సూద్ మా పాలిట దేవుడు అని అంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లే ఏర్పాటు చేశారు సోను. కొందరినైతే ఏకంగా ఫ్లయిట్లో కూడా పంపించారు. ఇప్పుడు సహాయంపరంగా ఇంకో మెట్టు ఎక్కే దిశలో అడుగులు వేస్తున్నారు.
కరోనా కారణంగా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం సోనూ సూద్ ఓ కొత్త యాప్ను తయారు చేయించారు. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ‘‘అర్హులందరికీ తప్పకుండా ఈ యాప్తో సాయం అందుతుంది’’ అని అంటున్నారు సోనూ సూద్.