జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ ఫేస్-4లోని హైటెక్ అలుకాస్ ప్రైవేట్ లిమిటె కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అలుకాస్ కంపెనీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో కంపెనీ వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అగ్ని ప్రమాదంలో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.