పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన జనసేన పార్టీ నెల్లూరు రూరల్

నెల్లూరు సిటీ, ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ మహాపురుషుని స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం.వారు నాడు చేసిన త్యాగానికి ప్రతిఫలమే తెలుగు వారి ఘన కీర్తి. వారి స్ఫూర్తి కొంతైనా ఉంటే గత ప్రభుత్వాలకి ఉండి ఉంటే రాష్ట్ర విభజన పూర్తయి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ఏర్పాటు వాదంలో ఎంత పక్షపాత వైఖరి నడిచిందో రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలిసికూడా రాష్ట్ర అభివృద్ధిలో విఫలమయ్యేవారు కాదు. ఇప్పటికి మూడు రాజధానులు అంటూ రచ్చ చేసిన వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలైనా ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధికి కృషి చేయలేదు. రానున్నది జనసేన ప్రభుత్వమే, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపుతాం అని తెలిపారు. అనంతరం వారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆర్యవైశ్య మహా సంఘం తరఫున జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ మరియూ సభ్యులతో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, అమీన్, షాజహాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.