కూనవరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలను జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించారు.. ముందుగా మాధవరపు నరసింహారావు అమ్మాయి పెరాలసిస్ తో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దండుబోయిన రాధాకృష్ణ డయాలసిస్ తో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోట సూరి నారాయణ అల్లుడు రమేష్ కాన్సర్ తో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాధవరపు వీరభద్రరావు, అడపా నరసింహారావు, మాధవరపు కోటేశ్వరరావు, చౌటుపల్లి లాలిబాబు, మాధవరపు నానీ, ఉమ్మడిశెట్టి సురేష్, బండారు గుణశేఖర్, ఉండమట్ల దుర్గారావు, మాధవరపు భీమరాజు మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.