గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందజేసిన పిట్టా బాలు

విజయనగరం: గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలంలో కొండ తామరపల్లి గ్రామంలో చర్చి గోడకూలిన ఘటనలో ఇటీవల మర్రి నారాయణ రావు గాయాలు పాలయ్యారు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని, ఆయువకుడిని పరామర్శించి, గంట్యాడ మండలం జనసేన పార్టీ నుంచి ఐదువేల రూపాయలు ఆర్థికసహాయాన్ని పార్టీ యువనాయకుడు పిట్టా బాలు ఆధ్వర్యంలో గంట్యాడ జనసేన మండల అధ్యక్షలు సారాధి అప్పలరాజు, జనసేన నాయకుడు లక్కిడాం సర్పంచ్ వాసిరెడ్డి పవన్ చేతులమీదుగా అందించారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలను చేపడతామని యువనాయకులు పిట్టా బాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన యువనాయకులు అడపా రాంబాబు, జి.గౌరినాయుడు, కృష్ణ పాల్గొన్నారు.