రైతుల ఆందోళనకు క్రీడాకారుల మద్దతు.. అవార్డులు తిరిగి చ్చేస్తాం..

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. ఢిల్లీలో హర్యానా, పంజాబ్‌ రైతులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మాజీ క్రీడాకారులు కూడా తమ మద్దతిచ్చారు. రైతుల ఆందోళనపై బలగాలను ప్రయోగించడాన్ని పలువురు మాజీ క్రీడాకారులు తప్పుబట్టారు. రైతుల ఆందోళనకు వారు మద్దతిస్తూ.. గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు కర్తార్‌ సింగ్‌బీ అర్జున అవార్డు గ్రహీత, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు సజ్జన్‌ సింగ్‌ చీమాబీ అర్జున అవార్డు గ్రహీత, హాకీ క్రీడాకారుడు రాజ్‌బీర్‌ కౌర్‌, తదితరులు ఈ నెల 5 న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్‌ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.