జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ పోస్టర్ ను ఆవిష్కరించిన బొలిశెట్టి శ్రీనివాస్

  • నియోజకవర్గాల వారీగా “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” పోస్టర్ల పంపిణీ కార్యక్రమం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల ఇంచార్జుల చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వారి స్వగృహంలో “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన 3 రకాల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.