జయరాంపురంలో జనసేన నాయకుల పర్యటన

పాలకొండ నియోజకవర్గం, జయరాంపురంలో జనసేన నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా జయరాంపురంలో ఉన్న సమస్యలను అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. పాదయాత్రలో హామీలను కురిపించిన ఆయన ఇప్పుడు ఎందుకు మొహం చాటిస్తున్నాడని జనసేన నాయకులు ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పరిశ్రమలు స్థాపించబడతాయని జనసేన నాయకులు ప్రజలకు వివరించారు. జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం రాజకీయాలకు వచ్చారని, ఒక్కసారి ఆయనను గెలిపిస్తే పాతిక సంవత్సరాల భవిష్యత్తు చూస్తారని జనసేన నాయకులు సాయి, పైడ్రాజు అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మూడు వేల కుటుంబాలకు లక్ష చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారని జనసేన నాయకులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.