మత్స్యకార అభ్యున్నతి యాత్రకు శ్రీకారం చుట్టిన కాంతిశ్రీ

ఎచ్చర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పెద్ద కొవ్వాడలో ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మత్స్యకార అభ్యున్నతి యాత్రను గంగ పూజతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతిశ్రీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కొనసాగే యాత్ర మత్స్యకారుల సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అన్నారు.