రైతులకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

ఆచంట: రైతే రాజు అనే నినాదం తో జాతీయ రైతు దినోత్సవ సందర్బంగా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పూర్తి తో వజ్రకరూరు మండల అధ్యక్షుడు కేశవ అచ్చనాల అద్వర్యంలో మండలం లోని పంట పొలాలు ను పరిశీలించి రైతులకు శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంచిపెట్టిన జనసేన నాయకులు, మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చనాల మాట్లాడుతూ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని భావిస్తున్నా, మన దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో రైతులకు ఎటువంటి భరోసా లేదని వారి వెన్నుముక వంచుతున్నారని ఆయన ద్వజమెత్తారు. జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ సారధ్యములో త్వరగా రైతును రాజుగా చూస్తామని ఆయన తెలియ చేసారు. ఈ కార్యక్రమములో వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ నాయక్, సెర్టి సూర్యనాయక్, జాయింట్ సెక్రటరీ వెంకట్రమణ, మండల నాయకులు లాలు మరియు మండలం లో రైతులు, నాయకులు పాల్గొన్నారు.