రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి వర్ధంతి వేడుకలు

చండ్రగూడెం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, బెజవాడ బొబ్బిలి స్వర్గీయ వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి సందర్భంగా రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో కొత్త చండ్రగూడెంలోని రంగా విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా పేద, బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా రంగా రాజకీయ ప్రయాణం కొనసాగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు గర్నెపూడి వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, వైసిపి గ్రామఅధ్యక్షుడు చెలికాని రమేష్, రాధా రంగా మిత్రమండలి సెక్రటరీ లేళ్ల నాగేశ్వరరావు, శీలం ప్రకాష్ రావు, భీమిరెడ్డి వెంకటేశ్వరరావు, శీలం సుబ్బారావు, కడియం ఐదవ వెంకయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, కొండూరు నవీన్, సతీష్, లంకా బ్రదర్స్, శీలం బ్రదర్స్, రెడ్డి విజయ్ కుమార్, బండి బ్రదర్స్, మట్ట గోపాల్ రావు, శీలం ప్రసాద్ రెడ్డి, ఈత కొట్టు నాని తదితరులు పాల్గొన్నారు.