రద్దయిన పెన్షన్లకు నిరసనగా రిలేనిరాహరదీక్షకు జనసేన సంఘీభావం

రాజంపేట: బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటి కలెక్టరేట్ ఎదుట రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధుల పట్ల రద్దయిన పెన్షన్లకు నిరసనగా రిలేనిరాహారదీక్షకు మద్దతుగా 2వ రోజు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు రద్దయిన పెన్షన్లు శాపమని అన్నమయ్య కలెక్టరేట్ ఎదుట రిలేనిరహదీక్ష చేపట్టిన జిల్లా వి.హెచ్.పి.స్ అధ్యక్షుడు పూసపాటి రెడ్డయ్య జనసేన పార్టీ తరపున మద్దతు కోరగా 2వ రోజు సంఘీభావం తెలుపుతూ రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర వైస్సార్ కాంగ్రెసుపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలం అవుతున్నా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి పక్కన పెట్టి అవ్వ, తాతలు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్ మీద ఆధారపడి ఉన్న అర్హులకు గుండె కోత మిగిల్చి లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాసమస్యలు మరచి ప్రజాసంక్షేమ అవసరాలకు కాకుండా, అనవసరమైన మాధ్యమాల్లో ప్రభుత్వ ఖజానాన్ని పక్కదోవ మళ్ళించి, వారి వ్యక్తిగత అభివృద్ధి రాజకీయ లబ్ధికోసమే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా ఏదో కారణం చూపి కుట్రతో రద్దు చేసిన పెన్షన్లను వెంటనే పునరుద్దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాచేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అలానే అన్నమయ్యజిల్లా అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి మార్చుకుని సమస్యల మీద దృష్టి పెట్టి విచారణ చేపట్టి ప్రభుత్వం తరపున పెన్షన్లు వస్తేనే పూట గడుస్తుంది లేదంటే వారి జీవనాదారానికి వేరే మార్గం లేక దిగులు చెందుతున్న దివ్యాంగులకు మరియు పెన్షన్ల మీద ఆధారపడి ఉన్న వారందరికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారి పట్ల అండగా ఉంటూ పోరాడుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, విహెచ్ పీఎస్, వివిధ మండలాల నాయకులు, ప్రజాసంఘాలు పాల్గొన్నారు.