తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈరోజు ‘శరత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ముందు జాగ్రత్తగా ఆయన మంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తాం అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రకటించారు. తన తండ్రి శరత్ కుమార్ కి కరోనా వైరస్ ఉందని ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారని ఆయన ప్రస్తుతం డాక్టరు పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది.. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.