యువశక్తి కార్యక్రమానికి తరలి రండి: షేక్ సుభాని భాయ్

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత తమ గళాన్ని వినిపించేందుకు యువశక్తి కార్యక్రమానికి రండి.. షేక్ సుభాని భాయ్

ఉదయగిరి: కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న యువతకుముందు ఉద్యోగ అవకాశాలు కల్పించక మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వని వైనాన్ని ఎండ కడుతూ యువత గళాన్ని వినిపించేందుకు రణస్థలంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన యువశక్తి కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా వింజమూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా షేక్ సుభాని మాట్లాడుతూ.. అడ్డగోలుగా రాష్ట్ర విభజన అయి పేర్లు కావస్తున్నా అభివృద్ధి శూన్యం కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక జాబ్ క్యాలెండర్ లో లేవు యువత గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని కుటుంబాన్ని రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యువతకు స్ఫూర్తినిచ్చిన చైతన్య మూర్తి శ్రీ స్వామి వివేకానంద జయంతి యువ దినోత్సవ సందర్భంగా ఉత్తరాంధ్రలోని రణస్థలం వద్ద యువత గళం వినేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభకు విచ్చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువత పాల్గొని తమ గళాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నానని సుభాని అన్నారు.