‘నా సేన కోసం.. నా వంతు’కు టీమ్ జనసేన సింగపూర్ విభాగం రూ.5 లక్షల విరాళం

టీమ్ జనసేన సింగపూర్ విభాగం ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమానికి రూ.5 లక్షలు విరాళం అందచేశారు. గిరిధర్ సరాయ్ ఆధ్వర్యంలో టీమ్ జనసేన సింగపూర్ సభ్యులు సమకూర్చిన ఈ మొత్తాన్ని శ్రీమతి కోయ విష్ణుప్రియ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చెక్కు రూపంలో అందచేశారు. సోమవారం పవన్ కళ్యాణ్ గారిని కలసిన ఆమె టీమ్ జనసేన సింగపూర్ విభాగం పార్టీకి మద్దతుగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా తెలియచేశారు.