ఛలో రణస్థలం ప్రచార జోరు

గజపతినగరం బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు స్థానిక జనసేన పార్టీ నాయకత్వంతో పాటు కలిసి యువశక్తి యూత్ కోఆర్డినేషన్ కమిటీ తరుపున సుమారు 600 మంది యువతీ యువకుల మధ్య ఛలో రణస్థలం ప్రచారం జోరుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాలవలస యశస్విని, ముర్రాపు సురేష్, మిడతాన రవి మరియు కన్వీనర్ పెదపూడి విజయ్ కుమార్, శివదత్ బోడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కాలేజ్ యాజమాన్యానికి కమిటీ తరుపున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.