వైసీపీ నాయకుడు పైలా నరసింహయ్య వ్యాఖ్యలను ఖండించిన శ్రీకాంత్ రెడ్డి

కదిరి: వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు పైలా నరసింహయ్య శుక్రవారం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తాడిపత్రి నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు పైలా నరసింహయ్య పవన్ కళ్యాణ్ గారిని విషపురుగని, రౌడీ లాగా చేస్తున్నారని, అదేవిదంగా మంత్రులను, వైయస్సార్ పార్టీ అధ్యక్షున్ని తిడుతున్నారనీ, పవన్ కళ్యాణ్ నీ చెప్పులతో కొడతారని అనడం జరిగిందని, మంత్రుల తీరును బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందని శ్రీకాంత్ అన్నారు, పైలా నరసింహయ్య పవన్ కళ్యాణ్ గారిని రౌడీ అని అన్నారు, మరి టిడిపి జనసేన ఆఫీసుల పైన దాడి చేసిన వాళ్ళని ఏమనాలి..? తప్పులన్నీ మీ పార్టీకి సంబంధించిన వారు చేసి వాటికి సంబంధించి మాట్లాడి, వాటికి సంబంధించి స్పందిస్తే, మంచి అనేది జనానికి నిదానంగా చేరుతుంది, చెడు అనేది త్వరగా జరుగుతుందని దానికి నిదర్శనం వైఎస్ఆర్సిపి పార్టీ 151 సీట్లు గెలవడం అనేది ఇప్పుడిప్పుడే జనాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు సిపిఎస్ రద్దు చెయ్యలేదు, అంచలంచెలుగా మద్యాన్ని నిషేధం చేస్తానని చెప్పారు కానీ ఎందుకు చెయ్యలేదు, మద్యం షాపుల పేరుతో అధిక డబ్బులతో రెంట్లు దోచుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు పాలసీల పైన మాట్లాడుతుంటే మీ మంత్రులకు చేతగాక ఆయన వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అందజేస్తుంటే చూసి ఏడవ లేక ఏం చేయాలో తెలియక ప్రభుత్వం చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ప్రజల్లో ఎక్కడ పేరు వస్తుందోనని బయపడి ప్యాకేజీ తీసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చెప్పే అబద్దాలను నమ్మేలా ప్రజలు లేరని ప్రజల ఆలోచనలతో ఉన్నారని, రాబోవు కాలంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడి ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఏమైనా చేస్తే ఊరుకునేది లేదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.