సఖి క్లబ్ ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. సావిత్రి పెళ్లి రోజు సందర్భగా గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు, పిల్లలకు, బ్రెడ్, భోజనం ప్యాకెట్లు అందజేసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జి శేషుకుమారి మాట్లాడాతూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం సావిత్రి పెళ్లి రోజు సంధర్భంగా ఇక్కడ అన్నదానం చేయటం, పేషెంట్స్ కు భోజనం ఇవ్వటం, సఖి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సేవా కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అనేక చోట్ల మీరు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. వీరందరికీ, మరియు హాస్పటల్ సూపరిండెంట్ ముమిన్నకి కూడా నా తరుపున ప్రత్యేక ధన్యవాదములు. ఈ హాస్పిటల్ ఏరియాలో మొక్కలు నాటే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి క్లబ్ రీజనల్ చైర్ పర్సన్ ఎన్.నాగలక్ష్మి, సిహెచ్ సావిత్రి నెంబర్, ఎస్.వి. రమణ నెంబర్, కే.ఉమాదేవి మెంబర్ మరియు జనసేన నాయకులు బుర్ర సూర్యప్రకాశరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెనుముల సత్యానంద రెడ్డి, పబ్బినిడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, కండవల్లి సూర్యకుమారి, జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.