గన్నవరం జనసేన కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళులు

గన్నవరం: జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గం జనసేన కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించడం జరిగింది. సత్యం, అహింస, సత్యాగ్రహము అనే సిద్ధాంతాన్నినమ్మి మనం కూడా ఆయన బాటలో నడవాలని కృష్ణాజిల్లా జనసేన కార్యదర్శి బండ్రెడ్ది రవి పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చిమటా రవి వర్మ, గన్నవరం మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణ్ రావు, విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, మండల నాయకులు పసుమర్తి చంద్రశేఖర్, కోట దుర్గాప్రసాద్, దుంపల సంధ్యారాణి, కోలవెన్ను నాని, కొడిమెల రవి, కోనపరెడ్డి నాని, లంకే సురేష్, చిత్తజల్లు కుమారి, తోట నాగరాజు, మహమ్మద్ సందాని, రియాజ్, అడ్డగిరి రామకృష్ణ, నీలం సాయి రంగారావు, గుంటుపల్లి హర్ష, కొండూరి హరి, గుడిసె సురేష్ తదితరులు పాల్గొన్నారు.