ఉంగుటూరు జనసేనలో భారీ చేరికలు

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం, చిన నిండ్రకోలను గ్రామంలో ఉంగుటురు నియోజకవర్గ ఇన్చార్జ్ పత్సమట్ల ధర్మరాజు అధ్వర్యం లో వట్టి వసంత కుమార్ కి నివాళులు అర్పించి, మౌనం పాటించి, సమావేశం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పార్టీ బలోపేతానికి ఏవిధంగా కృషి చేయాలో, వార్డు బూత్ స్థాయిలో సమస్యలు పరిష్కారించే విధంగా తగు సూచనలు చేసారు. తదనంతరం నడింపల్లి కళ్యాణ్ వర్మ అధ్వర్యంలో పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో 60 మంది ఇతర పార్టీల నుండి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు.