మరుగు దొడ్లు నిర్మాణం కోసం మిరియాల రామకృష్ణ భిక్షాటన

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగు దొడ్లు నిర్మాణం కోసం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవు, ఉన్నా కొన్ని పాఠశాలాల్లో అవి పరిశుభ్రంగా లేవు అని కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారికి ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. అందుకే వ్యవస్థలకు బుద్ధి వచ్చే విధంగా ఖమ్మం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భిక్షాటన చేయడం జరిగిందని తెలియజేసారు. అధికారులు స్పందించే వరకూ జనసేన పోరాటం చేస్తుంది, లేని పక్షంలో భిక్షాటన చేసిన డబ్బులు ద్వారానే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ భిక్షాటన మధ్యలో అనుకోకుండా కలిసిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కు కూడా సమస్యను వివరించి భిక్షాటన చేయడం జరిగింది. స్థానిక ప్రజలు, అభ్యుదయవాదులు భిక్షాటన కార్యక్రమాన్ని అభినందిస్తూ తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు మెడబోయిన కార్తిక్, అజయ్ కృష్ణ, దేవేందర్, కొండా పవన్, బాణాల శ్రీకాంత్, ఉత్తమ్ రాజు, మాలిక్, రమణ కుమార్, పుల్లారావు, గంగాధర్, స్రవంత్ పాల్గొన్నారు..