కోలా జాన్ ప్రసాద్ ను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామనికి చెందిన కోరుకొండ మండలం కమిటీ ప్రధాన కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్(కళ్యాణ్) అర్ధరాత్రి అస్వస్థకు గురైయ్యారు. అస్వస్థకు గురైన ప్రసాద్ ను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం తీసుకుంటున్న జనసేన నాయకుడిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐ.టి కో- ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, పుణ్యక్షేత్రం జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి గణేష్(నాగు), చల్లా దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.