క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

వినుకొండ నియోజకవర్గం, నర్సనాయని పాకాలు గ్రామంలో నివసిస్తున్న జనసేన క్రియాశీలక కార్యకర్త చదలవాడ చిన్న శ్రీను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వినుకొండ నియోజకవర్గం జిల్లా నాయకులు నిస్శంకర శ్రీనివాస్ ను అడిగి పూర్తి సమాచారం తీసుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న జనసైనికుడు చిన్న శ్రీను కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కు పంపించి వారికి అందజేయవలసినదిగా సూచించారు..మంగళవారం చదలవాడ చిన్న శీను వారి ఇంటికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలసి వెళ్లడం జరిగింది. పార్టీ తరపున చదలవాడ చిన్న శ్రీను భార్య చదలవాడ పార్వతికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపి వారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కుని చదలవాడ పార్వతికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిలాని, నాయుబ్ కమాల్, వడ్రాన మార్కండేయులు, బండారు రవి కాంత్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, పార్వతీ నాయుడు, మండల అధ్యక్షులు సాల్మన్ రాజ్, హనుమాన్ నాయక్, అడపాల అనీల్, వెంకట నరసయ్య, వేముల వెంకటేశ్వరరావు, వీరమహిళలు శివ పార్వతి, ఉష, జానకి, సునీత, మాధవి, నియోజకవర్గ నాయకులు పూలరాజు, ఎర్రం శెట్టి వెంకటేశ్వరరావు, అంకారావు, నాని, నెల్లూరి రాజేష్, శివ్వాది చిరంజీవి, గంగరాజు, రవి మరియు జనసైనికులు పాల్గొన్నారు.