విద్యకళ్యాణ్ ను సత్కరించిన వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో టార్గెట్ బాల్ క్రీడాకారుడు నిక్కుల విద్యకళ్యాణ్ కి జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య చేతుల మీదుగా ఘనంగా సత్కారం చేయడం జరిగింది. గత వారం ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి టార్గెట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ టీం తరుపున ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్బంగా జనసేనపార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య మాట్లాడుతూ ఈ ఆదివాసీ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ పధకం సాధించడం గిరిజన ప్రజలందరికీ ఎంతో గర్వకారణం. యువత విధ్యకళ్యాన్ యొక్క క్రీడా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తమ భవిష్యత్ నిర్దేశించుకుంటారని ఆశిస్తున్నామని ఈ సందర్బంగా విద్యకళ్యాణ్ యొక్క క్రీడా విషయంలో ప్రోత్సాహమిస్తూ మేమంతా సహాయంగా ఉంటామని, మేము వర్దమాన క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా మా ఆలోచన చేస్తామని, గిరిజన ప్రాంతంలో నుంచి జాతీయ స్థాయికి వెళ్లేలా క్రీడాకారులు వెళ్లాలని మన ప్రాంత కీర్తి ఇనుమూడింపజెయ్యాలని డా.గంగులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల నాయకులు వడాకాని నాని, వంతల బుజ్జిబాబు, పుండరీనాద్, స్వామి, రవి, వెంకట్, సందేశ్ జి.మాడుగుల అధ్యక్షులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, భానుప్రసాద్ పాడేరు నాయకులు అశోక్, కిల్లో అశోక్, సంతోష్, హుకుంపేట కార్యవర్గ నిర్వహణ సభ్యులు సురేష్, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.