గాయాల పాలైన అడబాల రమణకి ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్న జనసేన నాయకులు

రాజమండ్రి సిటీ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉంటూ జనసేన పార్టీ అభివృద్ధికి కృషిచేసిన జనసైనికులు అడబాల రమణ కుటుంబానికి 50 వేలు చెక్కును జనసేన నాయకులు అందించారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్, మరియు అడబాల రమణ కి సభ్యత్వం చేయించిన రాజేష్ ఖన్నా ప్రమాద బీమా రావడానికి కృషిచేసిన అల్లాటిరాజు, గుణ్ణం శ్యాం సుందర్, విన్నావాసు వీరి చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఏరాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకి కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వాలు చేయించి వారిని వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నారని ప్రమాదవశాస్తూ ఎవరైనా పార్టీ కార్యకర్తలు గాయపడినా, దురదృష్టవశాత్తు మరణించినా వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిన ప్రతిఒక్కరికి బీమా చేయించారని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్య ఖర్చులకు, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఉపయోగపడేలా భీమా పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జామ్ సత్యనారాయణ, వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు దాసరి గురునాథం, రాజేష్ ఖన్నా, ప్రధాన కార్యదర్శిలు, పైడిరాజు, నల్లంచెట్టు వీర బాబు, భాష, లిమ్రా, కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాం సుందర్, విన్న వాసు, సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి, చిరంజీవి యువత కార్యదర్శి ఏడిద బాబి, 10వార్డ్ చందర్ రావు, సింగర్ వెంకటేష్ ప్రసాద్, మొండేటి మరియు 28వార్డు విక్టరీవాసు, మంచాల సునీల్, ఏడిద ప్రసాద్, పటాన్ ఖాన్, ఆకిరెడ్డి ప్రసాద్, ముమ్మిడి నాగ రాజు, దుర్గా ప్రసాద్, దుర్గా జనసైనికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.