క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోండి: షేక్ పాషా

కొణిజర్ల: జనసేన పార్టీ చేపట్టిన మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొణిజర్ల మండల మరియు వైరా నియోజక వర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరూ విజయ వంతం చేయాలని కొణిజర్ల మండల ముఖ్యనాయకులు పాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ.. జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా గతంలో సభ్యత్వం తీసుకున్న వారు మరలా రెన్యువల్ చేయించుకోవాలని, కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. భారత దేశ చరిత్రలో వేరే ఏ పార్టీ కూడా కార్యకర్తలకు అండగా 5 లక్షలు రూపాయల ప్రమాద బీమా ఇవ్వలేదని, జనసేన కార్యకర్తలు ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ఖర్చు చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బు చెల్లిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.