చంద్రముఖి 2 లో నటించనున్న కియారా

భరత్ అనే నేను.. వినయ విధేయ రామ చిత్రాల ద్వారా  తెలుగు తెరకు దగ్గరైన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఈ సమయంలో ఆమె ఒక సౌత్ మూవీ చేయడానికి అంగీ కరించినట్లు  టాక్ వినిపిస్తుంది. ఇటీవల లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో కియారా నటించింది. ఆయనతో ఈసారి సౌత్ లో కియారా వర్క్ చేయబోతుంది. తమిళంలో రూపొందబోతున్న చంద్రముఖి 2 చిత్రంలో లారెన్స్ మరియు కియారాలు కలిసి నటించబోతున్నారు.

లక్ష్మీబాంబ్ చిత్రంకు గాను లారెన్స్ దర్శకత్వంలో నటించిన కియారా చంద్రముఖి 2 సినిమా కోసం ఆయనతో కలిసి నటించేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం. పి వాసు దర్శకత్వంలో మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న చంద్రముఖి 2 షూటింగ్ లో కియారా అద్వానీ పాల్గొనబోతుంది. సూపర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కియారా అద్వానీని నటింపజేస్తున్నారు.