ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శంకర్ గౌడ్ సంతాపం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న అకాల మరణం చెందారు. సాయన్న కుటుంబసభ్యులకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శంకర్ గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న అకాల మరణం బాధాకరం. 1994 నుంచి 5 సార్లు శాసన సభ్యులుగా సేవలు అందించిన సాయన్న నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయం. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని శంకర్ గౌడ్ తెలిపారు.