ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు.!

  • అధికార పార్టీ, పోలీస్ లు నాదేండ్ల మనోహర్ కు క్షమాపణ చెప్పాలి..
  • మీకు మూడు నెలలు మాత్రమే కాలపరిమితి, అన్ని గుర్తుంచుకుంటాం
  • జనసేన నేతలు..

విశాఖలో జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే, ఆయనను మా నాయకులను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని, శాంతియుతంగా, ట్రాఫిక్ లకు అడ్డు లేకుండా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టమేముందని, ఒక పక్క పోలీసులకు చెప్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని, విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో కూడలి క్లోజ్ చేయటం ఏమిటని? ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధిస్తారా అని, ఈ ప్రభుత్వం తీరు మార్చుకొని ఎడల ఎంతటి ఉద్యమానికైనా జనసేన పార్టీ సిద్దమని, పోలీసులు ఐ.పి.సి సెక్షన్ల ను మాని వై.సీ.పీ సెక్షన్ల ను ఆచరిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఇక మూడు నెలలు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని వైసిపి నేతలతో సహా పోలీసులు కూడా గుర్తుంచుకోవాలని, తక్షణమే మా నాదేండ్ల మనోహర్ కు నాయకులకు క్షమాపణ చెప్పాలని సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, అకేపాటి సుభాషిని, కొండ రాజమోహన్, దేవర మనోహర్, రాజేష్ ఆచారి, దినేష్ జైన్, రమేష్ నాయుడు, హిమవంత్, పార్ధు, కిషోర్ తదితరులతో కలిసి వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.