క్రియాశీలక కార్యకర్త ప్రసన్నకుమార్ కు బీమా చెక్కును అందజేసిన మేడ

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పసుపులేటి ప్రసన్నకుమార్ జనవరి నెలలో బైక్ స్కిడ్ అవ్వడంతో గాయ పడగా, ప్రసన్నకుమార్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన వైద్య ఖర్చులు నిమిత్తం జనసేన పార్టీ తరుపున ఇన్సూరెన్స్ శాంక్షన్ కాగా, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య రాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ 50000 వేల రూపాయల బీమా చెక్కుని ప్రసన్నకుమార్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన ఉప అధ్యక్షులు ముక్క రాంబాబు, పరిజర్లపేట గ్రామ జనసేన ఎంపీటీసీ పల్లా నాగు, నాగవరుపు భాను, హేమంత్, బొబ్బరాడ వాసు, మన్య నాగు, అడబాల హరి, ప్రగడ బాలాజీ, మెడిద వీరబాబు, పోసిబాబు, కొచ్చర్ల బాబీ, రాచపోతుల సురేష్, పెమ్మాడ సతీష్, చదువు నాగేశ్వరరావు, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, పెద్ద ఎత్తున కలవచర్ల గ్రామ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.