బలుసుతిప్ప గ్రామంలో పితాని సుడిగాలి పర్యటన

  • పర్యటనలో భాగంగా పలుకుటుంబాలకు పితాని పరామర్శ
  • క్రియాశీలక సభ్యత్వ నమోదుపై అవగాహన

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో పర్యటించి, ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకోవాలని అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలకు, జనసేన అభిమానులకు క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం వల్ల ఉండే ఉపయోగాలు అందరికీ వివరించి చెప్పారు. అదేవిధంగా ఇటీవల యాక్సిడెంట్ గురై దెబ్బలు తగిలిన పెమ్మాడి ఆదినారాయణని పరామర్శించడం జరిగింది. మరియు అదే గ్రామంలో ఓలేటి శ్రీను కుమారుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి వెంట కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూకల శ్రీరామదుర్గ, మండల కార్యదర్శి పిల్లి గోపి, బీమాల సూర్య నాయుడు గిడ్డి రత్నశ్రీ, సంగాని ధర్మారావు, పెమ్మడి శీను, ఓలేటి శ్రీను, డొక్కాడి రాంబాబు, ధనుప్రోలు విజయ్, తదితరులు పాల్గొన్నారు.