జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి: లింగోలు పండు

అమలాపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ సభ్యత్వం నమోదు చేయించుకోవాలని అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు కోరడం జరిగింది. పేద ప్రజల తరపున అండగా ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి 2024 ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని మనమందరం కలిసి ముందుకు వెళ్లాలని తెలియజేశారు.