జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు, ఈ నెల 14 వ తేదీన మచిలీపట్నంలో జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు కోరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, ఈ సభలో జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని పేర్కొన్నారు..ఈ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారన్నారు. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని స్పష్టం చేశారు. అటు సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆరోపించారు. సభకు వెళ్లడం తమ హక్కు అని ప్రతి జనసేన కార్యకర్త చాటిచెప్పాలన్నారు. పోలీసులు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి సభాముఖంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ ఆర్య అధినేత జనసేన నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు తేజ ప్రవీణ్, బుధ్ధా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-08-at-13.39.29-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-08-at-13.39.29-1-1024x768.jpeg)