వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మికి సత్కారం
శృంగవరపుకోట, లక్కవరపు కోట మండలం, దాసుల్లపాలెం గ్రామానికి చెందిన జనసేపార్టీ వీర మహిళ సగుబిండి వెంకటలక్ష్మికి కె.ఎన్.ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజ్యసభ సభ్యులు జే.వి.ఎల్ నరసింహారావు చేతుల మీదుగా ఆమె చేస్తున్న రక్తదాన, వస్త్రదాన, మరియు నిరుపేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించే తీరు ప్రజల ద్వారా తెలియడంతో ఆమెను గుర్తించి ఆమె సేవలకుగాను బహుమతి ప్రధానోత్సవం మరియు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో మొట్ట మొదటి వీర మహిళగా ఎన్నో సేవలు అందిస్తూ మరెంతోమంది వీరమహిళలను రాబోయే ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్న ఆమెను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-09-at-11.59.14-1024x576.jpeg)