జనసేన మద్దతు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి..
- రాజంపేట జనసేన నేతలు తాళ్లపాక శంకరయ్య, మల్లెం నరసింహులు
రాజంపేట: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన కోనేటి హరి వెంకటరమణను గెలిపించాలని రాజంపేట జనసేన నేతలు తాళ్లపాక శంకరయ్య, మల్లెం నరసింహులు కోరారు. శనివారం రాజంపేట మండల పరిధిలోని పోలి అప్పారావుపేట పంచాయతీ వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో కోనేటి హరి వెంకటరమణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంకుశ పాలన పోవాలని చదువుకున్న విద్యావంతులు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేసి జనసేన పార్టీ మద్దతుగా పోటీ చేస్తున్న కోనేటి హరి వెంకటరమణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-11-at-4.53.15-PM-1024x768.jpeg)