కరపత్రాలను అందిస్తూ పాదయాత్ర చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, మత్స్యకారుల యొక్క అభ్యున్నతి కై ఈ నెల 20వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభకు సంఘీభావం తెలపాలని ఉద్దేశంతో రణస్థలం మండలంలో అల్లువలస మరియు కొన్ని గ్రామాలు నుంచి మత్స్యకారుల యొక్క కష్టాలను వింటూ సభకు సంఘీభావం తెలపాలని కరపత్రాలను అందిస్తూ పాదయాత్ర చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ, రాష్ట్ర కార్యక్రమల నిర్వాహణ జాయింట్ కోఆర్డినేటర్ డా. విశ్వక్షేణ్, అలాగే మండల నాయకులు మల్లేశ్వరరావు, దుర్గారావు, లక్ష్మినాయుడు, బాబాజీ, రాజరమేష్, సత్య, ఎర్రయ్య మరియు జనసైనికులు పాల్గొన్నారు.