ఛలో మచిలీపట్నం పోస్టర్ ను ఆవిష్కరించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఛలో మచిలీపట్నం పోస్టర్ ను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మార్చి 14వ తేదిన జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. దాంతోపాటు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వందలాదిగా పైయి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పదవ ఆవిర్భావ సభకి దిగ్విజయ సభగా నామకరణం చేయడం, ఆ దిగ్విజయ సభ నుంచి రాష్ట్ర రాజకీయాలలో జరగబోయే పెను మార్పులను రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్లాలి. 2024లో గెలుపే లక్ష్యంగా ఎటువంటి దిశ నిర్దేశాలతో జనసైనికులు గ్రామాలలో జనసేనని బలోపేతం చేసే దానికి, వారికి సూచనలు దాంతోపాటు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వారు 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి గాలికి వదిలేసి నామమాత్రపు పదవులతో రాష్ట్రాన్ని దోచుకునేటువంటి అనేక విషయాలపై దిగ్విజయ సభ నుంచి అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతంగా చేయాలని కోరారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు అందరూ భారీగా తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, ఖాజా, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, చిన్న, శ్రీహరి, రహమాన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.