రాబోయేది జనసేన ప్రభుత్వమే: భరత్

ఎస్.పి.ఏ.స్.ఆర్ నెల్లూరు జిల్లా: రాబోయేది జనసేన ప్రజా ప్రభుత్వమే అని జనసేన పార్టీ నాయకులు భరత్ అన్నారు. రాజ మండ్రి, విజయవాడ, గుంటూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాటా మంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజలే ఈ అభిప్రాయాన్ని తన పర్యటన లో తెలియచేశారు అని ఆయన అన్నారు. కార్మికులు, ఆటో డ్రైవర్ లు, కూలిలు, రైతులు, యూత్ ఎవరిని అడిగినా పవన్ కల్యాణ్ గారు రావాలి.. పాలన మారా లి అంటున్నారు అని ఆయన తెలియ చేశారు.
జనసేన ప్రభుత్వం వస్తే ఇంటి ఇంటికి నాయకులమే వాలింటర్లు గా మారి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం అని.. ప్రతి మండలంలో ఓక అనాధ ఆశ్రమంని ఏర్పాటు చేస్తాం అని ఆయన ఈ సందర్భంగా తెలియ చేశారు.