వాసుపల్లి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, కోనపాపేట గ్రామం నందు వాసుపల్లి రాంబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో చికిత్స పొందుతున్నటువంటి రాంబాబు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, గుర్రం గంగాధర్, పుక్కల కుమార్, డి శ్రీను, బి స్వామి, సిహెచ్ రాజు, ఎస్ గణేష్, వై కొండబాబు, ఏ సతీష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.