పేదలకు అండగా ఆమదాలవలస జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన సూరపు అప్పమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గం నాయకులు కొత్తకోట నాగేంద్ర ఆధ్వర్యంలో, కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, కోరుకొండ మల్లేశ్వర రావు, తులగాపు మౌలీ, ఆర్ జగ్గారావు, టి శ్రీనివాస్ మాస్టారు, పి యోగి, కె నరేష్, టి తిరుపతి , గేదెల వాసు, సంగం నాయుడు, ఎస్ రమేష్, ఆర్ అనంత్ మరియు జనసైనికులు, ఊరు పెద్దలు,యువత సహకారంతో తమవంతు సహాయంగా 10 వేల రూపాయల నగదును, 6 బ్యాగుల సిమెంట్ అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ పరంగా ఇంటి నిర్మాణానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.