తంబళ్ళపల్లెలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

  • పది సభ్యత్వాలు కంటే ఎక్కువ చేసిన వాలంటీర్లకు సన్మానం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తంబళ్ళపల్లె నియోజకవర్గం మూలకాల చెరువు మండల ప్రెసిడెంట్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన సభ్యత్వ కిట్స్ అందజేయడానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ విచ్చేసి పది సభ్యత్వాలు కంటే ఎక్కువ చేసిన వాలంటీర్లను సన్మానించి క్రియాశీలక సభ్యత్వ కిట్లు, భీమా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా ఉపాధ్యక్షులు మధుబాబు, జి.డి నెల్లూరు ఇంఛార్జి పొన్న యుగంధర్, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జెల రెడ్డెప్ప, ఆర్ట్ డైరెక్టర్ సురేష్, మండల ప్రెసిడెంట్ ది.శంకర, యన్ శంకర్, నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.