గుంజవరం గ్రామంలో జనంలోకి జనసేన

పోలవరం మండలం, గుంజవరం గ్రామంలో మండల అధ్యక్షులు చిన్ని ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం రెండవ రోజు నసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం జనసేన ఇంచార్జ్ చిర్రి బాలరాజు ప్రజల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి సమస్యలను ఎన్నిసార్లు చెప్పిన ఎమ్మెల్యే మరియు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంట్లో ఉండే 3 బల్బులకు 10,000 కరెంటు బిల్లు వచ్చిందని ఒకసారి 5,000 వచ్చిందని, మరోసారి 3000 వచ్చిందన్నారు. పేదవారము మేము ఎలా ఇంత బిల్లు కట్టగలమని వాపోయారు. ఈ అరాచక పాలన పోవాలి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ కే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.