పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం లంకాపు ఠాణేలంక గ్రామంలో గోదశి పుండరేష్ పెదనాన్న ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది. అనంతరం ఐ పోలవరం మండలం పశువులలంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన యిళ్ళ రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, కడలి వెంకటేశ్వరరావు, మాదాల శ్రీధర్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.