అధికారులు అనీల్ కుమార్ యాదవ్ కి పీఏలుగా వ్యవహరిస్తున్నారు: గునుకుల కిషోర్

నెల్లూరు జిల్లా, కూల్చటానికి అనుమతులు అడిగితే నీళ్ళు నములుతున్నారు అధికారులు, ప్రజా సమస్యలపై అపాయింట్మెంట్ అడిగితే ఉన్నత అధికారులు స్పందించడం లేదు, పేదలంటే లెక్క లేదు ఈ వైసీపీ నాయకులకు, బాధితులకు సమయం ఇవ్వండి, మరో వసతి కల్పించండి అని గత వారం రోజులుగా అభ్యర్దిస్తున్నా పేదలపై కనికరం లేని ప్రభుత్వం బుధవారం ఉదయం 6 గంటలకి నెల్లూరు సిటీ శ్రీనివాసపురం గచ్చికాలవ మీద ఉన్న ఇళ్లు కూల్చారు. అక్కడకి చేరుకున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అధికారులను బాధితులకు నోటీసులు ఇవ్వలేదు, మీకు అనుమతులు చూపండి అని అడిగినా మొహం చాటశారు కానీ ఏ పత్రం చూపలేక పోయారని నిరాస్వతులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.