శ్రీశ్రీశ్రీ దొర్లమ్మ తల్లి అమ్మవారి జాతరలో పాల్గొన్న “బత్తుల” దంపతులు

రాజానగరం మండలం, కానవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ దొర్లమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా కనులు మిరుమిట్లు గోలిపే విధంగా అంగరంగ వైభవంగా జరిగింది. శోభయమానంగా జరిగిన ఈ మహోత్సవంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించి, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జనసేన నాయకులు శ్రీకృష్ణపట్నం సర్పంచ్‌ కిమిడి శ్రీరామ్‌, సూర్యారావు పేట ఎంపిటిసి వల్లభశెట్టి వెంకటరమణ (డబ్బు), నాతిపం దొరబాబు, కురుమళ్ల మహేష్, కమిడి సత్తిబాబు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్) , సుంకర బాబ్జీ, చాట్ల వెంకటేష్, ఆనందేవుల సూరిబాబు, రామిశెట్టి సతీష్, సంగిశెట్టి శ్రీనుబాబు, పుత్సల సాయి, హేమంత్, దేవన దుర్గా ప్రసాద్ (డిడి), రామిశెట్టి ప్రసాద్, వార్డు మెంబెర్ అంజిబాబు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.